కేంద్ర సర్కార్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్. అర్ధరాత్రి హడావుడిగా కొత్త కేంద్ర ఎన్నికల కమిషనర్ ను నియమించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అన్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా ఉండాలంటే ఎన్నికల కమిషన్ నిష్పాక్షికమైన పాత్ర పోషించేలా ఉండాలని సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో పునరుద్ఘాటించిందని పేర్కొన్నారు. CECని ఎన్నుకునే ముందు 19వ తేదీ వరకు వేచి ఉండాలన్నారు. హడావుడిగా సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోవడంపై మండిపడ్డారు.