అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి మండలంలో ఉన్న ఉపమాక శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని మంత్రి అనిత వంగలపూడి తిరుమలలో టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడును కోరారు. ఈ సందర్బంగా ఆమె వినతిపత్రాన్ని సమర్పించారు. అంతకు ముందు శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం టీటీడీ క్యాంపు కార్యాలయంలో చైర్మన్, ఈవోలతో భేటీ అయ్యారు. ఆలయంలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలన్నారు.