ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఈనెల 20న జరగనుంది. ఈ విషయాన్ని బీజేపీ హైకమాండ్ కీలక ప్రకటన చేసింది. ఈనెల 19న సీఎం అభ్యర్థిని వెల్లడించనుంది. సాయంత్రం ఈ కార్యక్రమం ఉండనుంది. ఇప్పటికే మంత్రివర్గ ఏర్పాటుకు 15 మంది ఎమ్మెల్యేలతో జాబితాను సిద్దం చేసింది. ఆప్ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ను భారీ తేడాతో ఓడించి విస్తు పోయేలా చేసిన పర్వేశ్ వర్మను సీఎంగా దాదాపు ఖరారు చేసింది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ప్రధాని మోడీ హాజరవుతారు.