గుంటూరు జిల్లాలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాద ఘటనపై స్పందించారు జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి కందుల దుర్గేష్. ఘటనపై ఆరా తీశారు. పలువురు మృతి చెందడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు, జీజీహెచ్ వైద్యులకు మంత్రి ఆదేశించారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు కూడా సంతాపం వ్యక్తం చేశారు.