రాష్ట్రంలో జీబీఎస్ వ్యాధి పట్ల ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి. ఈ వ్యాధికి సంబంధించిన మందులు అన్ని ఆస్పత్రులలో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. వ్యాధి లక్షణాలు ఉన్నట్లు అనుమానం ఉంటే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని సూచించారు. వైద్య , ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. కొంత కాలం పాటు చికెన్ తినడం మానేస్తే మంచిదని సూచించారు.