క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది బీసీసీఐ. ఈ ఏడాది టాటా ఐపీఎల్ - 2025 టోర్నీకి సంబంధించి షెడ్యూల్ ను విడుదల చేసింది. మార్చి 22 నుంచి ప్రారంభమై 65 రోజుల పాటు కొనసాగుతుంది. మొత్తం 10 జట్లు పాల్గొంటాయి. తొలి మ్యాచ్ కేకేఆర్ - ఆర్సీబీ జట్ల మధ్య కోల్ కతా ఈడెన్ గార్డెన్ లో ప్రారంభమవుతుంది. 13 వేదికలలో 74 మ్యాచ్ లు జరగనున్నాయి. మే 5న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనుందని వెల్లడించింది.