వాజేడు మండలం పేరూరు ఆశ్రమ పాఠశాల విద్యార్థి సోడియం వినీత్ ఆదివారం జ్వరంతో మృతి చెందాడు. విద్యార్థి మృతికి వార్డెన్ నిర్లక్ష్యమే కారణమని బంధువులు పాఠశాల ముందు ఆందోళన చేశారు.కుటుంబస భ్యులు మాట్లాడుతూ.. విద్యార్థి ఆరోగ్యంపై వార్డెన్ నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా ముందే సమాచారం అందించి ఉంటే వినీత్ చనిపోయేవాడు కాదని కన్నీటిపర్యంతం అయ్యారు. వెంటనే వార్డెన్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.