హరీశ్ రావు వల్ల ప్రాణహాని ఉంది
NEWS Feb 16,2025 09:41 am
మాజీ మంత్రి హరీశ్ రావుపై సంచలన ఆరోపణలు చేశారు చక్రధర్ గౌడ్. తన పేరు చెప్పి వంశీకృష్ణ రూ. 30 లక్షలు డిమాండ్ చేశాడని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హరీశ్ నాతో పాటు , తన కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాపింగ్ చేయించారంటూ వాపోయారు. తనపై రేస్ , హత్యాయత్నం సహా అనేక అక్రమ కేసులు బనాయించేలా చేశాడని మండిపడ్డారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన సమయంలో ఉన్నది ఉన్నట్టు చెప్పానన్నారు. ఈ కేసులో హరీశ్ రావు, రాధా కిషన్ రావులను వెంటనే అరెస్ట్ చేయాలన్నారు.