తెలంగాణలో కులగణన పారదర్శకంగా చేశాం
NEWS Feb 16,2025 09:34 am
కేసీఆర్ ఫ్యామిలీపై నిప్పులు చెరిగారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఎమ్మెల్సీ కవితను చూసి తండ్రీ, సోదరుడు కేసీఆర్, కేటీఆర్ నేర్చుకోవాలంటూ ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం చేపట్టిన కుటుంబ సర్వేలో కవిత పాల్గొన్నారని చెప్పారు. ఇప్పటికే 55 రోజుల పాటు సర్వే చేపట్టామన్నారు. ఇప్పుడు మరోసారి 10 రోజుల పాటు సర్వేలో పాల్గొనేందుకు ఛాన్స్ ఇస్తున్నామన్నారు. సర్వే పూర్తయ్యాక పార్లమెంట్ లో చట్టం చేయాలని తీర్మానం చేస్తామన్నారు. బీజేపీ ఎంపీలు మోదీపై ఒత్తిడి తీసుకు రావాలన్నారు.