ఢిల్లీ తొక్కిసలాటపై విచారణ షురూ
NEWS Feb 16,2025 07:45 am
ఢిల్లీ రైల్వే స్టేషన్ లో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనలో 18 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీ. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. ఇందుకు గాను ద్విసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో సభ్యులుగా నార్తర్న్ రైల్వేకి చెందిన నర్సింగ్ దేవ్ , పంకజ్ గంగ్వార్. ఇందులో భాగంగా రంగంలోకి దిగింది కమిటీ. రైల్వే స్టేషన్ లోని సీసీ టీవీ ఫుటేజ్ ను భద్ర పర్చాల్సిందిగా ఆదేశించింది.