ఢిల్లీలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనలో 18 మందికి పైగా మృతి చెందారు. ఈ ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తొక్కిసలాటలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని, తక్షణమే ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని కోరారు టీపీసీసీ చీఫ్. మృతుల సంఖ్యను తగ్గించి చూపే ప్రయత్నం మోదీ కేంద్ర సర్కార్ చేస్తోందంటూ ఆరోపించారు.