మరోసారి కుల గణన ప్రారంభం
NEWS Feb 16,2025 04:45 am
ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కుల గణనలో పాల్గొనని వారి వివరాల నమోదుకు మరోసారి ఛాన్స్ ఇచ్చింది. ఇవాల్టి నుంచి ఈనెల 28వ తేదీ వరకు తమ వివరాలు నమోదు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. దీని కోసం టోల్ ఫ్రీ నం. 040-211 11111ను కూడా ఏర్పాటు చేశారు. ఫోన్ చేసిన వారి ఇంటికి వెళ్లి ఎన్యుమరేటర్లు వివరాలు నమోదు చేయనున్నారు. ఎంపీడీవో కార్యాలయం, వార్డు ఆఫీసులకు వెళ్లి కూడా నమోదు చేసుకోవచ్చన్నారు. కులగణన సర్వేలో 3,56,323 కుటుంబాలు పాల్గొనలేదని పేర్కొన్నారు.