ఢిల్లీ ఘటనపై ప్రెసిడెంట్..పీఎం సంతాపం
NEWS Feb 16,2025 04:12 am
ఢిల్లీ రైల్వే స్టేషన్ లో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనలో 18 మంది మృతి చెందారు. దీంతో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ. ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభ మేళాలో పుణ్య స్నానాలు చేసేందుకు పెద్ద ఎత్తున ప్రయాణీకులు స్టేషన్ కు చేరుకున్నారు. స్టేషన్ లోని 14, 15 ప్లాట్ ఫారమ్ లలో రాత్రి 8 గంటల ప్రాంతంలో తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది.స్టేషన్ లో పరిస్థితిని నియంత్రించేందుకు అదనపు భద్రతా దళాలను మోహరించారు. ఘటనపై విచారణకు ఆదేశించారు రైల్వే శాఖ మంత్రి అశ్విన వైష్ణవ్.