ఢిల్లీ రైల్వే ఘటనలో 18 మంది మృతి
NEWS Feb 16,2025 03:46 am
ఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన మహా కుంభ రష్లో 11 మంది మహిళలు, 4 మంది పిల్లలతో సహా 18 మంది మరణించారు. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ. విచారణకు ఆదేశించింది రైల్వే శాఖ. ఢిల్లీలోని ఎల్ఎన్జెపి ఆసుపత్రి చీఫ్ క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ ఈ మరణాలను ధృవీకరించారు. బాధితుల కుటుంబాలకు రూ. 10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 2.5 లక్షలు, స్వల్ప గాయాలకు రూ. 1 లక్ష ఆర్థిక సహాయం ప్రకటించింది కేంద్రం.