తిరుమల క్షేత్రం భక్త సందోహం
NEWS Feb 16,2025 03:33 am
తిరుమల పుణ్య క్షేత్రం భక్తులతో కిట కిట లాడుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 78 వేల 873 మంది భక్తులు దర్శించుకున్నారు. 30 వేల 65 మంది తల నీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.85 కోట్లు వచ్చిందని తెలిపారు ఈవో జె. శ్యామల రావు. ప్రస్తుతం దర్శనం కోసం 16 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు కనీసం 14 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.