విద్యార్థులు AI టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి
NEWS Feb 15,2025 03:06 pm
కోరుట్ల: ప్రపంచ ప్రఖ్యాత సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ ఐబీఎం ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రామకృష్ణ డిగ్రీ పీజీ కళాశాలలో చదువుతున్న డిగ్రీ సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ఏఐ టెక్నాలజీ గురించి 2రోజుల వర్క్ షాప్ నిర్వహించారు. ఏఐ టెక్నాలజీలో వాడే వివిధ మాడ్యూల్స్ గురించి విద్యార్థులకు వివరించి, వారికి ఐబీఎం సర్టిఫికెట్స్ ప్రధానం చేశారు. ఏఐ టెక్నాలజీ అన్ని రంగాలకు విస్తరిస్తోందని కళాశాల కరస్పాండెంట్ యాద రామకృష్ణ తెలిపారు.