రాహుల్ తో ముగిసిన రేవంత్ భేటీ
NEWS Feb 15,2025 12:05 pm
ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కీలక అంశాలపై చర్చించారు. ఈ ఇద్దరి మధ్య దాదాపు 45 నిమిషాలకు పైగా సాగింది. కాంగ్రెస్ కార్యవర్గం కూర్పు, మంత్రివర్గం విస్తరణ, కుల గణన సూర్యా పేట, ఎస్సీ వర్గీకరణ గద్వాల్ లో బహిరంగ సభల నిర్వహణ, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, పాలనా పరమైన కీలక అంశాలపై చర్చించారు రేవంత్ రెడ్డి. ఇదిలా ఉండగా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ గా ఉన్న దీపా దాస్ మున్షీ స్థానంలో మీనాక్షి నటరాజన్ ను నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది.