రోడ్డు డైవర్షన్ వల్ల నిలిచి పోయిన వాహనాలు
NEWS Feb 15,2025 09:08 am
ములుగు జిల్లా వెంకటాపురం మండలం యాకన్నగూడెం బ్రిడ్జి వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బ్రిడ్జి దెబ్బ తినడంతో అధికారులు డెవర్షన్ రోడ్డు ఏర్పాటు చేశారు. కాగా ఆ మార్గంలో ఓ ఇసుక లారీ టైర్ పంక్చర్ కావడంతో లారీని డ్రైవర్ మధ్యలోనే నిలిపి వేశాడు. దీంతో వెంకటాపురం - భద్రాచలం ప్రధాన రహదారి శనివారం రోజున మధ్యాహ్నం 12 గంటలకు స్తంభించి పోయింది. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు కిలోమీటర్ల కొద్ది నిలిచి పోయాయి.