మేడారం కు వచ్చిన భక్తులపై తేనెటీగల దాడి
NEWS Feb 15,2025 09:08 am
తాడ్వాయి (మం) మేడారంలో భక్తులపై తేనెటీగలు దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. మినీ జాతరలో భాగంగా సమ్మక్క - సారలమ్మలను దర్శించు కునేందుకు వచ్చిన 15 మంది భక్తులపై తేనెటీగలు దాడి చేయగా, బాధితులను స్థానిక కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో చికిత్స నిమిత్తం తరలించారు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన జిల్లా వైద్య శాఖ అధికారి గోపాలరావు బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.