బీఆర్ఎస్ నేతలకు ప్రచార యావ
NEWS Feb 15,2025 03:47 am
కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ పై భగ్గుమన్నారు. పదవి లేకుండా ప్రజలకు సేవ చేసే అలవాటు ఆ పార్టీ నేతలకు లేదన్నారు. ప్రభుత్వం ఎప్పుడు పడిపోతుందా , ఎప్పుడు దొడ్డి దారిన అధికారంలోకి రావాలా అని ఆలోచిస్తున్నారంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఒక్కరోజు మీడియాలో, పత్రికల్లో కనిపించకపోతే వాళ్లకు బీపీ పెరుగుతుందంటూ ఎద్దేవా చేశారు. ఈ జబ్బు ఎక్కువగా కేటీఆర్, కవితలకే ఉందన్నారు.