సీఎంగా కొలువు తీరిన రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోవడంతోనే సరిపోతోంది. పార్టీ హైకమాండ్ తక్షణమే రావాల్సిందిగా ఆదేశించింది. దీంతో ఆయన హుటా హుటిన హస్తినకు బయలుదేరి వెళ్లారు. ఊహించని విధంగా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ గా ఉన్న దీపాదాస్ మున్షీపై వేటు వేశారు. రాహుల్ గాంధీ టీంలో ఒకరైన మీనాక్షి నటరాజన్ కు కీలక బాధ్యతలు అప్పగించారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు 32 సార్లు ఢిల్లీకి వెళ్లారు రేవంత్ రెడ్డి.