నర్సరీని పరిశీలించిన కమిషనర్
NEWS Feb 14,2025 01:39 pm
మెట్ పల్లి: వన మహోత్సవంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ మోహన్ మున్సిపల్ పరిధి రేగుంటలో ఉన్న నర్సరీని శుక్రవారం పరిశీలించారు. నర్సరీలోని మొక్కలకు ప్రతిరోజు నీరు పోయాలని, పిచ్చిగడ్డిని ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు. వర్షాకాలంలో మొక్కలు నాటడానికి బ్యాగ్ ఫిల్లింగ్ చేస్తామన్నారు. ఆయన వెంట డీఈ నాగేశ్వరరావు, రత్నాకర్, విష్ణు, విజయ్, ముజీబ్, అనిల్, నిజాం, అశోక్, నరేశ్ తదితరులు ఉన్నారు.