జనసేన ఆధ్వర్యంలో అమరవీరులకు నివాళులు
NEWS Feb 14,2025 01:38 pm
కోరుట్ల: నేడు భారత దేశ బ్లాక్ డే గా మాతృభూమి సేవలో వీర మరణం పొందిన మన ధీర సైనికుల ప్రాణ త్యాగాలను గుర్తు చేసుకుంటూ కోరుట్ల పట్టణ జనసేన, సనాతన ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కార్గిల్ చౌక్ వద్ద కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు వోడ్నాల రామారావు, జనసైనికులు చిలువేరి సాయికృష్ణ, మాసం విజయ్, తుమ్మ సురేష్, దాసోహం అనిల్, బత్తిని సంజీవ్, రాజేందర్ పేట అభినవ్, అడ్లగట్ట సురేష్, శేఖర్, శ్రీనివాస చారి, సనాతన ధర్మ పరిరక్షణ సమితి నాయకులు పాల్గొన్నారు.