గెలిపిస్తే ప్రజల మధ్యనే ఉంటా
NEWS Feb 14,2025 12:25 pm
తనను గెలిపిస్తే ప్రజల మధ్యనే ఉంటానని, వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి. కోరుట్ల పట్టణంలోని జీఎస్ గార్డెన్స్ లో జరిగిన ఎమ్మెల్సీ సన్నాహక సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు, నాయకులు, కార్యకర్తలు , తదితరులు పాల్గొన్నారు.