శ్రీలక్ష్మి నరసింహ స్వామి సన్నిధిలో సుజిత్ రావు
NEWS Feb 14,2025 12:27 pm
మెట్ పల్లి పట్టణం లోనీ బోయవాడ లో శ్రీ లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం లో పాల్గొన్నారు టీపీసీసీ డెలిగేట్ సుజిత్ రావు. స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. సుజిత్ రావుకు సాదర స్వాగతం పలికారు పూజారులు. మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్, ఆలయ కమిటీ సభ్యులు నాగయ్య, ఆలయ అర్చకులతో పాటు పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఖుతుబ్ పాషా ,కోరుట్ల నియోజకవర్గ NSUI వర్కింగ్ ప్రెసిడెంట్ గద్దల భరత్ రాజ్ పాల్గొన్నారు.