ఏపీ అభివృద్దికి తైవాన్ సహకారం
NEWS Feb 14,2025 04:52 am
తైవాన్ అధికారుల బృందంతో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఏపీలో ఎలక్ట్రానిక్స్, టెక్స్ టైల్స్, ఫుట్ వేర్ రంగాల అభివృద్ధికి తైవాన్ సహకారం అందిస్తుందన్నారు. తైపీ ఎకనామిక్ అండ్ కల్చరల్ సెంటర్ ఇన్ చెన్నై డైరెక్టర్ జనరల్ రిచర్డ్ చెన్ తో మంత్రి చర్చలు జరిపారు. తైవాన్ సహకారంతో ఏపీలో నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని స్పష్టం చేశారు మంత్రి. ఇప్పటికే దావోస్ లో చేసుకున్న ఒప్పందాల వల్ల పెద్ద ఎత్తున పెట్టుబడులు రానున్నాయని తెలిపారు.