కగార్ ఆపరేషన్ ని వెంటనే నిలిపి వేయాలి
NEWS Feb 14,2025 04:41 am
నక్సల్స్ సమస్యను శాంతి భద్రతల సమస్యగా చూసినంత కాలం మరో వందేళ్లు గడిచినా పరిష్కారం కాదన్నారు సీపీఐ కార్యదర్శి రామకృష్ణ. దానిని రాజకీయ, ఆర్ధిక, సామాజిక సమస్యగా పరిగణిస్తేనే పరిష్కారం లభిస్తుందన్నారు. ఆదివాసీల పై మారణకాండను ఆపాలని, ఆపరేషన్ కగార్ నిలిపి వేయాలని కేంద్ర సర్కార్ ను డిమాండ్ చేశారు. నక్సల్స్ పేరుతో వేధింపులు పెరిగాయని, ఇది మంచి పద్దతి కాదన్నారు. ప్రజాస్వామిక వాదులు, మేధావులు, కవులు, కళాకారులు దాడులను ఖండించాలని కోరారు.