రంజాన్ మాసంలో ఏర్పాట్లు చేయాలి
NEWS Feb 14,2025 03:21 am
పవిత్ర రంజాన్ మాసంలో ప్రజలకు సౌకర్యాలు కల్పించేందుకు, ఏర్పాట్ల నిర్వహణకు ప్రభుత్వం నుంచి జిల్లా పరిపాలన, అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ వక్ఫ్ బోర్డ్ తరఫున లేఖ రాసినట్లు ఏపీ స్టేట్ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. ఇన్స్పెక్టర్ ఆడిటర్ వక్ఫ్ లకు, వక్ఫ్ సంస్థల నిర్వాహకులకు రంజాన్ మాసానికి సంబంధించి ఏర్పాట్లు చేపట్టాల్సిందిగా ఆదేశించామన్నారు.