తప్పించుకు తిరుగుతున్న నిందితుడి అరెస్ట్
NEWS Feb 13,2025 02:20 pm
దొంగతనం కేసులో కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్న నిందితుడు భానోత్ శేషును అరెస్టు చేసినట్టు సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. నిందితుడు కొంతకాలంగా కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతుండగా, అతనిపై గౌరవ న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ విషయంలో నిందితుడిని పట్టుకోవడం కోసం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, మెట్పల్లి డిఎస్పి ఎ రాములు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పడి నిందితుడు బీదర్ ప్రాంతంలో పట్టుకున్నారు.