బావిలో గుర్తుతెలియని మృతదేహం
NEWS Feb 13,2025 02:17 pm
కథలాపూర్ మండలం పోసానిపేట గ్రామ శివారులోని ఓ వ్యవసాయ బావిలో గుర్తుతెలియని మృతదేహం ఉన్నట్టు గ్రామస్థులు గుర్తించారు. మృతుడికి 30 ఏళ్ళు ఉంటాయన్నారు. బావి ఒడ్డుపై అంగీ, చెప్పులు ఉండగా, మృతుడి ఒంటిపై ప్యాంట్ ఉంది. ఇది హత్యనా.లేక ఆత్మహత్యనా తెలియాల్సి ఉందని గ్రామస్థులు అంటున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.