ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ అభ్యర్థి ప్రచారం
NEWS Feb 13,2025 02:16 pm
మెట్పల్లి పట్టణంలో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ అభ్యర్థి యాదగిరి శేఖర్రావు ప్రచారం చేశారు. ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్లను, ఉపాధ్యాయులను, న్యాయవాదులను, డాక్టర్లను, విద్యా ప్రముఖులను కలిసి తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఎల్లవేళలా అందరికీ అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఆయన వెంట దొంతుల రాజ్ కుమార్,రామారావు, వేణుగోపాల్, మహర్షి, ముత్యం రెడ్డి తదితరులున్నారు.