కుమార స్వామిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
NEWS Feb 13,2025 05:07 am
పుణ్య క్షేత్ర యాత్రలో భాగంగా తమిళనాడులో పర్యటిస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తంజావూరు కుంభకోణం సమీపంలోని స్వామి మలై క్షేత్రానికి చేరుకున్నారు. శ్రీ స్వామి నాథ స్వామిని దర్శించుకున్నారు. అంతకు ముందు తిరువనంతపురం లోని తిరువల్లం శ్రీ పరుశురామ క్షేత్రాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు . ఆయన వెంట కొడుకు అకిరా, టీటీడీ బోర్డు మెంబర్ ఆనంద సాయి ఉన్నారు. పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం పలికారు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు సభ్యులు.