ప్రభుత్వం విద్యా రంగం అభివృద్దికి పెద్దపీట వేస్తోందని చెప్పారు మంత్రి వాసం శెట్టి సుభాష్. ఆంగ్ల బోధనకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. విద్యార్థులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించామని, ఏపీని ఐటీ , ఏఐ హబ్ గా మార్చేందుకు సీఎం చంద్రబాబు , మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు త్వరలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు.