తల్లిదండ్రులపై కత్తి కొడవలితో దాడి
NEWS Feb 12,2025 06:37 pm
మెట్ పల్లి పట్టణంలో వేకువ జామున మానసిక స్థితి సరిగా లేక ఏళ్ళ అన్వేష్ (35) తన తల్లిదండ్రులపై కత్తి, కొడవలితో దాడికి పాల్పడినట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. ఈ ఘటనలో తల్లి రమాదేవికి మెడ, చేతి భాగంలో, తండ్రి గంగ నరసయ్యకు ఎడమ చేతి వేలు భాగాల్లో తీవ్ర గాయాలైనట్లు పేర్కొన్నారు. ఘటనపై తండ్రి గంగ నరసయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు మెంటల్ యాక్ట్, హత్యాయత్నం కింద కేసు చేసి దర్యాప్తు చేస్తున్నమన్నారు.