ప్రభుత్వం దెబ్బకు దిగి వచ్చింది. విపక్షాలు, బీసీ సంఘాల ఆందోళన చేపట్టడంతో తాము చేపట్టిన ఇంటింటి కుటుంబ సర్వేకు సంబంధించి రీ సర్వే చేపట్టాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ఫిబ్రవరి 16 నుండి 28 వరకు సర్వేలో పాల్గొనని వారి కోసం మరోసారి కుల గణన చేపట్టనున్నట్లు తెలిపారు డిప్యూటీ సీఎం భట్టి. దీంతో పంచాయతీ ఎన్నికలు మరింత ఆలస్యం కానున్నాయి. స్థానిక రిజర్వేషన్లు తేలిన తర్వాతే వీటిని నిర్వహించనున్నారు.