బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలి
NEWS Feb 12,2025 12:55 pm
బీజేపీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని టీచర్స్ ఎమ్మెల్సీ జిల్లా కన్వీనర్ వడ్డేపల్లి శ్రీనివాస్. పట్టభద్రుల అసెంబ్లీ కన్వీనర్ దొనికెల నవీన్ అన్నారు. మెట్పల్లిలో బుధవారం ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నిర్వహించిన వర్క్ షాప్లో వారు మాట్లాడారు. ఉపాధ్యాయుల, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి, నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి BJP అభ్యర్థులు కృషి చేస్తారన్నారు. రమేష్, వెంకట్ రెడ్డి, తదితరులున్నారు.