విరాట్ కోహ్లీ తన కెరీర్ లో 73వ హాఫ్ సెంచరీ చేశాడు. అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో వన్డేలో 55 బంతులు ఎదుర్కొని 52 రన్స్ చేశారు. ఆ కొద్ది సేపటికే పెవిలియన్ బాట పట్టాడు. విరాట్ కోహ్లీ గత కొంత కాలంగా ఫామ్ లేమితో బాధ పడుతున్నాడు. టీమిండియాకు హెడ్ కోచ్ గా గంభీర్ రావడంతో జట్టులో కీలక మార్పులు తీసుకు వస్తున్నాడు. యంగ్ క్రికెటర్లను ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. దీంతో సీనియర్లలో ఇన్ సెక్యూరిటీ పెరిగింది.