ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రా గ్రామంలో శ్రీ విజయ కిరణం షాపులో అగ్నిప్రమాదం జరిగింది. మినీ మేడారం సందర్భంగా జాతరకు కుటుంబ సమేతంగా వెళ్లగా 2 గంటల ప్రాంతంలో ఇంట్లో ఉన్న కరెంటు బోర్డు నుండి ఒక్కసారిగా మంటలు చెలరేగి కిరాణా షాప్ లో ఉన్న సామాగ్రి అంతా అగ్నికి ఆహుతి అయిందని, వాటితో పాటు ఇంట్లో ఉన్న నగదు 3 లక్షలరూపాయలు అగ్నికి ఆహుతి అయిందని, తన కిరాణం కాలిపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నానని బాధితుడు తెలిపాడు.