మాజీ ఎంపీ వి. హనుమంత రావు షాకింగ్ కామెంట్స్ చేశారు. కార్పొరేట్లపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. కార్పొరేటర్ కాగానే లెక్కకు మించి ఆస్తులు పోగేసుకుంటున్నారని ఫైర్ అయ్యారు. గతంలో ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా, రెండుసార్లు ఏఐసీసీ చీఫ్ గా, కేంద్ర మంత్రిగా పని చేసిన దామోదరం సంజీవయ్య ఏమీ సంపాదించ లేదన్నారు. నాటి పాలిటిక్స్ విలువలతో కూడి ఉండేవన్నారు. కానీ ఇవాళ అలాంటి పరిస్థితి చూద్దామన్నా కనిపించడం లేదంటూ వాపోయారు.