సీఎం చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తు అంతా ఏఐదేనని అన్నారు. గుంటూరులో కిమ్స్ శిఖర ఆస్పత్రిని ప్రారంభించారు. ఐదు రాష్ట్రాల్లో కిమ్స్ అందిస్తున్న సేవలు బాగున్నాయంటూ ప్రశంసించారు. ప్రతి కుటుంబంలో ఐటీ చదువుకున్న ఒక వ్యక్తి ఉండాలని తాను 1995లో చెప్పానని అది నిజమైందన్నారు. ఇప్పుడు ఏఐదే రాబోయే ప్రపంచమని కుండ బద్దలు కొట్టారు. మన దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయన్నది ముఖ్యం కాదని, ఎంత డేటా ఉందనేది ముఖ్యమన్నారు.