రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు చట్టభద్దత కల్పించడంతో పాటు షెడ్యూల్ కులాలను ఏ, బీ, సీ కేటగిరీలుగా రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో మాదిగ ప్రజా ప్రతినిధులతో కలిసి మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.