పాతబస్తీ మీదుగా ఎలక్ట్రిక్ బస్సులు
NEWS Feb 12,2025 10:04 am
టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. సికింద్రాబాద్ లోని జూబ్లీ బస్ స్టేషన్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు బస్సులు ప్రారంభించినట్లు తెలిపారు. ప్రతి గంటకు ఓ బస్సు నడుస్తుందన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, సెక్రటేరియట్, నాంపల్లి, అఫ్జల్ గంజ్ , బహదూర్ పుర, ఆరంఘర్ మీదుగా ఎయిర్ పోర్టుకు చేరుకుంటుందన్నారు. ఈ కొత్త సర్వీసులు ఉదయం 5.50 నుంచి అర్ధరాత్రి 12 వరకు అందుబాటులో నడుస్తాయన్నారు. ప్రతి రోజూ 6 బస్సులను 24 ట్రిప్లుగా నడుపుతామన్నారు.