ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సీరియస్ కామెంట్స్ చేశారు. మాజీ మంత్రి హరీశ్ రావుపై భగ్గుమన్నారు. అబద్దాలు చెప్పడంలో నెంబర్ వన్ అంటూ పేర్కొన్నారు. మసిపూసి మారేడు కాయ చేయడంలో , ప్రభుత్వాన్ని బద్నాం చేయడం పనిగా పెట్టుకున్నారంటూ ధ్వజమెత్తారు. కల్వకుంట్ల కుటుంబాన్ని జనం నమ్మే పరిస్థితిలో లేరన్నారు. కేటీఆర్, కవిత, కేసీఆర్ ఎన్ని ఆరోపణలు చేసినా సర్కార్ ను ఏమీ చేయలేరని హెచ్చరించారు.