అర్చకునిపై దాడి చేసిన దుండుగులపై చర్యలు తీసుకోవాలి
NEWS Feb 12,2025 04:16 am
చిలుకూరు బాలాజీ దేవాలయ అర్చకులు రంగరాజన్ పై జరిగిన దాడి దురదృష్టకరమని గంగాధర మండల కేంద్రానికి చెందిన అర్చకులు కుర్మచలం పవన్ కుమరచర్యులు అన్నారు. బుధవారం అయన మీడియాతో మాట్లాడుతూ.. దైవసేవలో నిమగ్నమైన బ్రాహ్మణ కుటుంబానికి చెందిన రంగరాజన్ను బెదిరించి దాడి చేయడం అమానుషమని అగ్రహం వ్యక్తం చేశారు. అర్చకుడిపై దాడిచేసిన దుండగులకు శిక్షపడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.