ఏపీపీసీసీ మాజీ చీఫ్ సాకె శైలజానాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను పదవుల కోసం పార్టీ మారలేదన్నారు. రాజకీయాలలో పదవులు రావడం పోవడం సహజమన్నారు. ఏపీలో అవకాశవాద రాజకీయాలు కొనసాగుతున్నాయని వాపోయారు. చంద్రబాబు నాయుడును కాంగ్రెస్ పార్టీ పెంచి పోషించిందన్నారు. ఆ తర్వాత ఆయన టీడీపీలో చేరాడని, మామ ఎన్టీఆర్ కు వెన్ను పోటు పొడిచాడని ఆరోపించారు. ఆయనకు విలువలు అనేవి లేవని, అధికారం కోసం ఎవరితోనైనా కలిసేందుకు సిద్దంగా ఉంటాడని షాకింగ్ కామెంట్స్ చేశారు.