27 ఏళ్ల అనంతరం ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుకున్న బీజేపీ కీలక ప్రకటన చేసింది. సీఎం రేస్ లో పలువురు ఉన్నా కేజ్రీవాల్ ను ఛాలెంజ్ చేసి ఓడించిన పర్వేశ్ వర్మ వైపే ప్రధాని మోడీ మొగ్గు చూపడంతో తననే తమ పార్టీ అభ్యర్థిగా ఖరారు చేసింది. కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్ నాథ్ సింగ్ ల ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది. ఏకగ్రీవంగా పర్వేశ్ వర్మను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు ప్రకటించారు. పర్వేశ్ వర్మ గతంలో జర్నలిస్ట్ గా పని చేశారు. తన తండ్రి సాహిబ్ సింగ్ వర్మ ఢిల్లీ సీఎంగా పని చేశారు.