డిగ్రీ..పీజీ కామర్స్ విద్యార్థుల క్షేత్ర పర్యటన
NEWS Feb 11,2025 02:30 pm
బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో అభ్యసిస్తున్న డిగ్రీ కామర్స్ విద్యార్థులు కామర్స్ విభాగ అధిపతి మేడ తిరుపతి ఆధ్వర్యంలో క్షేత్ర పర్యటన చేపట్టారు. మందమర్రి మండలంలోని అందుగులపేటలో గల సాయి నందిని సిరామిక్స్ పరిశ్రమను సందర్శించారు. సిరామిక్సులో తయారయ్యే వస్తువులు, ఉత్పత్తులు, అమ్మకాలు, దిగుబడులపై విద్యార్థులకు అవగాహన కల్పించినట్లు తెలిపారు ప్రిన్సిపాల్ డాక్టర్ కాంపల్లి శంకర్. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.