వైఎస్సార్సీపీ పంచాయితీరాజ్ విభాగం డైరీ 2025ను ఆవిష్కరించారు మాజీ సీఎం జగన్ . గ్రామ స్వరాజ్యం స్ధాపనకు తమ హయాంలో కీలక చర్యలు తీసుకున్నామని అన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులకు ఈ డైరీ ఓ దిక్సూచి లాగా ఉపయోగ పడుతుందని చెప్పారు. ఈ సందర్బంగా పూర్తి సమాచారంతో తయారు చేసినందుకు నిర్వాహకులను అభినందించారు. భారత రాజ్యాంగాన్ని, స్థానిక సంస్థలకు సంబంధించిన సమాచారాన్ని పూర్తిగా తెలుసు కోవాల్సిన అవసరం ప్రజా ప్రతినిధులకు ఉందన్నారు.