మెట్ పల్లి పట్టణంలోని మున్సిపల్ కమిషనర్ మోహన్ పలు వార్డులలో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. స్పెషల్ శానిటేషన్ పనులు నిర్వహించాలన్నారు. ప్రజలందరూ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మురికి కాలువలో ఇంటి నుండి వెలువడే చెత్తను గాని, ప్లాస్టిక్ కవర్స్ పారేయొద్దంటూ స్పష్టం చేశారు. డ్రైనేజీలో కానీ , రోడ్ల పైన కానీ చెత్త వేస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించారు కమిషనర్.