యూపీ సర్కార్ సంచలన ప్రకటన చేసింది. మహా కుంభ మేళాకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ఇప్పటి వరకు 44 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు చేశారని సర్కార్ వెల్లడించింది. ఈ సందర్బంగా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచి పోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. జబల్ పూర్ - ప్రయాగ్ రాజ్ మార్గంలో వెహికిల్స్ ఆగి పోయాయి. కాశీ, అయోధ్యలకు భక్తులు పోటెత్తుతుండడంతో వాహనాల రాక పోకలపై ఆంక్షలు విధించింది.